Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeKONASEEMAAmalapuramఅక్రమ ఆక్వా చెరువులపై పోరాటం చేసిన యువకుడిపై దాడి

అక్రమ ఆక్వా చెరువులపై పోరాటం చేసిన యువకుడిపై దాడి

-

Chat on WhatsApp

ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో న్యాయ పోరాటం చేస్తూ పర్యావరణ రక్షణకు కృషి చేసిన యువకుడిపై దారుణం జరిగింది. గ్రామానికి చెందిన చిక్కం వీర దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా అక్రమ ఆక్వా చెరువుల తవ్వకాలపై నిరసన వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. ఆక్వా చెరువుల వల్ల పర్యావరణ కాలుష్యం మరియు నీటి నాశనం జరుగుతుందని కోర్టులో ఫిర్యాదు చేయడంతో, కోర్టు చెరువులను నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

కోర్టు ఉత్తర్వులను పట్టించుకోని కొందరు ఆక్వా రైతులు చెరువుల తవ్వకాలను కొనసాగించేందుకు ప్రయత్నించారు. ఈ చర్యలపై అధికారులకు ఫిర్యాదు చేసిన వీర దుర్గాప్రసాద్, చెరువుల వద్ద ఫోటోలు తీసేందుకు వెళ్లినప్పుడు ఆక్వా రైతుల చేత దాడికి గురయ్యాడు. అతడిని స్తంభానికి కట్టి చితకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.

వీర దుర్గాప్రసాద్ ప్రస్తుతం అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడి పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చట్టం తమ పనిని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఆక్వా చెరువుల కారణంగా పర్యావరణం మరియు ప్రజల జీవనోపాధి దెబ్బతింటోందని, దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఈ ఘటన పట్ల అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయ పోరాటం చేసిన వ్యక్తిపై దాడి చేయడం గర్హనీయం అని సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, పర్యావరణానికి తగు రక్షణ కల్పించాలనే నినాదాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp