కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది సమాచారం అందుకున్న ఇందుకూరుపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు అనంతరం ఇందుకూరుపేట ఎస్సై నాగార్జున రెడ్డి వివరాలు మేరకు సముద్రం నుండి కొట్టుకు వచ్చిన మృతదేహం నెల్లూరుకు చెందిన అన్నం ప్రమీల అనే మహిళగా గుర్తించామని గత రాత్రి భర్తతో గొడవపడి తెల్లవారుజామున ఇంటి నుండి బయటకు వచ్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు అన్నారు విచారణ నిమిత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామన్నారు… అనంతరం ఆయన మీడియా మిత్రులకు చిన్న సందేశాన్ని ఇచ్చారు ఏదైనా సంఘటన తెలిసిన తర్వాత సంబంధిత అధికారుల్ని కలిసి వివరాలు తెలుసుకొని వార్తలను ప్రసారం చేయాలని కోరారు.
మైపాడు బీచ్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం
