Telangana Municipal Elections: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఉపందుకున్నాయి. ముఖ్యమంత్రి “రేవంత్ రెడ్డి” పార్టీ నేతలతో కలిసి “ఎన్నికల వ్యూహాలపై సమీక్షా సమావేశం” నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC chief Mahesh Kumar Goud) మరియు ఇతర కీలక నేతలతో సమావేశం జరిగింది.
ముఖ్యమంత్రి, మున్సిపల్ ఎన్నికల్లో “విజయం సాధించడమే ప్రధాన లక్ష్యం” అని స్పష్టం చేశారు. పార్టీలోని విభేదాలను పక్కన పెట్టి సమిష్టిగా పనిచేయడం వల్లే విజయం సాధ్యమని అన్నారు. “ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేరే విధంగా చర్యలు తీసుకోవడం అత్యవసరమని సీఎం సూచించారు.
చైర్మన్, మేయర్ అభ్యర్థుల ఎంపికలో(Chairman Mayor candidate selection) సున్నితమైన వ్యూహం తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల ఫలితాల తర్వాత అభ్యర్థులను ఖరారు చేయడం ద్వారా “పార్టీలో అసంతృప్తిని తగ్గించవచ్చని” ఆయన భావించారు.
ఈ సమీక్షలో “క్షేత్రస్థాయి బలోపేతం, అభ్యర్థుల ఎంపిక కసరత్తు, ప్రచార సరళి” వంటి అంశాలను విస్తృతంగా చర్చించారు.
ALSO READ:Sachin Tendulkar | రంజీ ట్రోఫీలో Arjun Tendulkar రికార్డ్
