T20 World Cup 2026 లో ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయ్. బంగ్లాదేశ్ భద్రతా కారణాలతో భారత్లో ఆడేందుకు నిరాకరించడంతో ICC ఆ దేశాన్ని టోర్నీ నుంచి బహిష్కరించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కూడా బంగ్లాదేశ్ మద్దతుగా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ నిర్ణయాన్ని అధికారికంగా పంచుకున్నారు.
అయితే, ఇప్పుడు పాక్ బాయ్కాట్ నిర్ణయంపై యూటర్న్ తీసుకునే అవకాశముంది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్పై PCB సమీక్ష చేస్తోంది.
శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ రద్దు అయితే తమకు భారీ ఆర్థిక నష్టం కలుగుతుందని, టోర్నీ ఇమేజ్ దెబ్బతినేలా ఉందని PCBకు ఈమెయిల్ ద్వారా తెలియజేసింది.
దీంతో PCB తన ప్రభుత్వాన్ని సంప్రదించి, శ్రీలంక ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నందున పాకిస్థాన్ మద్దతు ఇవ్వవలసిందని నిర్ణయించింది. శ్రీలంక బోర్డు అధ్యక్షుడు షమ్మీ సిల్వా నేరుగా PCB చైర్మన్ మోహ్సిన్ నఖ్వీని సంప్రదించి.
ఈ సమయంలో భారత్-పాక్ మ్యాచ్ల కారణంగా కోల్పోతున్న Gate Money, హాస్పిటాలిటీ ఆదాయాన్ని గుర్తు చేశారు. PCB ఈ విషయాన్ని పాక్ ప్రధాని దృష్టికి తీసుకెళ్తుందని ప్రకటించింది.
