Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeNationalస్మృతి మంధాన అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించింది

స్మృతి మంధాన అరుదైన రికార్డుతో చరిత్ర సృష్టించింది

-

Chat on WhatsApp

టీమిండియా మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన రికార్డు న‌మోదు చేసింది. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో సెంచరీ బాదిన స్మృతి, ఇది ఆమెకు 8వ వన్డే శతకమైంది. దీంతో భారతదేశానికి తరఫున అత్యధిక సెంచరీలు కొట్టిన మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. మిథాలీ రాజ్ (7 శతకాలు)ను వెనక్కి నెట్టిన ఆమె, ప్రస్తుతం మూడో స్థానంలో హర్మన్ ప్రీత్ కౌర్ (06) ఉన్నారు. ఆసీస్ ప్లేయర్ మెగ్ లానింగ్ 15 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మూడో వన్డేలో, ఆతిథ్య భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. న్యూజిలాండ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోవడంతో, భారత్ క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కివీస్‌ను 232 పరుగులకు ఆలౌట్ చేసింది. ఈ మ్యాచ్‌లో కివీస్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హాలిడే 96 బంతుల్లో 86 పరుగులు చేసి మంచి స్కోరు అందించింది.

233 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. షఫాలీ వర్మ (12) త్వ‌ర‌గా ఔట్ అయిన తర్వాత, యాస్తికా భాటియా (35)తో కలిసి స్మృతి భారత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. 121 బంతుల్లో 10 బౌండరీలతో శతకం నమోదు చేసిన స్మృతి, ఈ ఏడాది ఏడు మ్యాచుల్లో మూడు శతకాలు బాదడం విశేషం. భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (59)తో కలసి స్మృతి 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా అలవోక విజయాన్ని సాధించింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp