Shamshabad Airport bomb threat | కోవైట్, లండన్ ఫ్లైట్లకు బాంబు బెదిరింపు కలకలం   

Bomb squad teams conducting checks at Shamshabad Airport after threat alerts Bomb squad teams conducting checks at Shamshabad Airport after threat alerts

Shamshabad Airport bomb threat: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. వరుసగా రెండు అంతర్జాతీయ ఫ్లైట్లకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచిహెచ్చరికలు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

కోవైట్ నుంచి హైదరాబాదుకు రానున్న KU-373 ఫ్లైట్‌కు బెదిరింపు మెయిల్ రావడంతో, సేఫ్టీ ప్రోటోకాల్ మేరకు విమానం మస్కట్‌కు మళ్లించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకున్నామని విమానయాన అధికారులు వెల్లడించారు.

అదే సమయంలో లండన్ నుంచి హైదరాబాదుకు వచ్చే బ్రిటిష్ ఎయిర్‌వేస్ BA-277 ఫ్లైట్‌కూ ఇలాంటి బెదిరింపు మెయిల్ రావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది. సురక్షితంగా ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులను దించి అసోలేషన్ ఏరియాకు తరలించారు.

ALSO READ:కోహ్లీని దాటేసిన వైభవ్ సూర్యవంశీ….2025లో భారత్‌లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్  

బాంబ్ స్క్వాడ్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలు విమానాన్ని పూర్తిగా ఖాళీ చేసి తనిఖీలు కొనసాగిస్తున్నాయి. టర్మినల్ ప్రాంతంలో అదనపు భద్రత ఏర్పాటుచేశారు.

ఈ బెదిరింపు మెయిల్స్ మూలాన్ని గుర్తించేందుకు సైబర్, ఇంటెలిజెన్స్ విభాగాలు సంయుక్త దర్యాప్తు చేపట్టాయి. కాసేపు ఆందోళన నెలకొన్నప్పటికీ, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *