Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshఏలూరు జిల్లాలో పెరుగుతున్న ఎండలు – అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన

ఏలూరు జిల్లాలో పెరుగుతున్న ఎండలు – అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచన

-

Chat on WhatsApp

ఏలూరు జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెంట్రిసెల్వి సూచించారు. మంగళవారం ఆయన ప్రజలకు సూచనలు చేస్తూ, వడదెబ్బ ముప్పు పెరుగుతున్న దృష్ట్యా ఎండ తీవ్రత నుండి రక్షణ కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే సమయంలో ప్రజలు బయటకు వెళ్లేప్పుడు నెత్తిక టోపీ లేదా రుమాలు కట్టుకోవాలని, తేలికపాటి కాటన్ బట్టలు ధరించాలని సూచించారు. అలాగే, మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఎండతప్పించి ప్రయాణాలు తగ్గించాలని చెప్పారు.

వడదెబ్బకు గురైన వ్యక్తులను వెంటనే నీడకు తరలించి తగిన చికిత్స అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్నానాలు చేయడం, తగినంత నీరు తాగడం, ఒంటిపై తడి గుడ్డలు వేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు.

జిల్లాలో ఉన్న ఆసుపత్రులను ఎండకాలానికి అనుగుణంగా సిద్ధంగా ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తగిన చర్యలు తీసుకుని ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులదని స్పష్టం చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp