శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం,రేగాటిపల్లి చెరువు వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య,కుటుంబ సంక్షేమ,వైద్య విద్య శాఖల మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన రెడ్డి.అనంతరం రేగాటిపల్లి మరియు ముచ్చురామి ఎస్సీ కాలనీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ముచ్చురామి గ్రామ బ్రిడ్జిను సందర్శించారు. అదేవిధంగా ధర్మవరం పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయంలో రంగనాథుని దర్శించుకుని వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆలయ పునర్నిర్మాణ క్రతువులో భాగమయ్యారు.అలాగే PRT సర్కిల్ లక్ష్మీ ఏజెన్సీస్ నందు ఉచిత వంటగ్యాస్ పంపిణీ పథకంలో భాగంగా మహిళలకు దీపావళి కానుకగా దీపం – 2.0 కార్యక్రమంలో రాప్తాడు శాసనసభ్యులు శ్రీమతి పరిటాల సునీతమ్మతో కలిసి పాల్గొన్నారు.








