Tuesday, March 24, 2026
Chat on WhatsApp
HomeInterNationalభారీ భూకంపంతో మరోసారి తేలికపడ్డ ఇండోనేషియా

భారీ భూకంపంతో మరోసారి తేలికపడ్డ ఇండోనేషియా

-

Chat on WhatsApp

ఇండోనేషియాను మరోసారి భూకంపం కుదిపేసింది. సులవెసి ద్వీపంలో ఈ ఉదయం 6.1 తీవ్రతతో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉత్తర సులవెసి సమీపంలో భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల లోతున గుర్తించారు. అయితే, దీనివల్ల సునామీ ముప్పు లేదని అధికారులు ప్రకటించడంతో ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తూనే ఉన్నాయి. గతంలోనూ సులవెసి ద్వీపంలో తీవ్ర భూకంపాలు సంభవించాయి. 2021లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించి 100 మందికిపైగా మృతి చెందగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.

అంతకుముందు 2018లో పలులో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించి సునామీతో కలిపి 2,200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 2004లో జరిగిన 9.1 తీవ్రత భూకంపం తర్వాత సంభవించిన భారీ సునామీ కారణంగా 1.7 లక్షల మందికిపైగా మరణించారు.

తాజా భూకంపానికి సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు. కానీ భూకంపం ప్రభావంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులను అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

హైదరాబాద్ మెట్రో ఇక పూర్తిగా సర్కారుదే..

హైదరాబాద్: నగర ప్రయాణికులకు జీవనాడిగా మారిన 'హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail)' ఇక పూర్తిగా తెలంగాణ ప్రభుత్వపరం కాబోతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) కొనసాగిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును...
- Advertisement -
Chat on WhatsApp