భారత జట్టు సిడ్నీ వేదికగా జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐదో టెస్టులో మరోసారి విఫలమైంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు, 72.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్లో రిషభ్ పంత్ 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు.
శుభ్మన్ గిల్ (20), రవీంద్ర జడేజా (26), కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (22) తక్కువ స్కోర్లతో నిలిచారు. కేఎల్ రాహుల్ (04), యశస్వి జైస్వాల్ (10) కూడా తక్కువ స్కోర్లతో పెవిలియన్ చేరారు. విరాట్ కోహ్లీ (17), నితీష్ కుమార్ రెడ్డి (0) మరోసారి నిరాశపరిచారు.
ఆసీస్ బౌలర్లలో స్కాట్ బొలాండ్ 4 వికెట్లు తీసాడు. మిచెల్ స్టార్క్ 3, పాట్ కమిన్స్ 2, నాథన్ లైయన్ 1 వికెట్ తీశారు. భారత జట్టు నిరాశజనక ప్రదర్శనతో 185 పరుగులకే ఆలౌట్ అయింది.
