Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeTelanganaJogulamba Gadwalసైబర్ నేరాలపై గద్వాల్ లో అవగాహన ర్యాలీ

సైబర్ నేరాలపై గద్వాల్ లో అవగాహన ర్యాలీ

-

Chat on WhatsApp

గద్వాల్ పట్టణంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించడానికి సైబర్ జాగృతి దివస్ సందర్భంగా, ఎస్పీ టి. శ్రీనివాస రావు ఆదేశాల మేరకు బుధవారం ర్యాలీ నిర్వహించారు. డిగ్రీ కాలేజీ విద్యార్థులతో గద్వాల్ లోని ఎస్వీ ఎమ్ డిగ్రీ కళాశాల నుంచి కృష్ణ వేణి చౌక్ వరకు ఈ ర్యాలీ జరిగింది. సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు గడ్వాల్ సీఐ శ్రీ టి శ్రీను మాట్లాడారు.

ఈ సందర్భంలో సీఐ శ్రీ టి శ్రీను మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా సైబర్ నేరాల కూడా విస్తరిస్తున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. “అశాలీలంగా మోసాలు చేస్తూ సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని, దురదృష్టవశాత్తు ఈ లొతుల సాయంతో ప్రజలు తమ సంపాదనను కోల్పోతున్నారు” అని చెప్పారు.

సీఐ, విద్యార్థులకు సైబర్ నేరాలకు సంబంధించిన వివిధ రకాల మార్గాలను వివరించారు. ఈ రోజుల్లో జరిగే మోసాలు అయిన జంప్డ్ డిపాజిట్ స్కీమ్, డిజిటల్ అరెస్టు, ఇన్వెస్ట్మెంట్ ప్రౌడ్ మరియు సైబర్ బుల్లింగ్ వంటి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. “మనం ఆశ, అత్యాశ లేకుండా కష్టపడి సంపాదించిన డబ్బును రక్షించుకోవాలి,” అని సీఐ చెప్పారు.

సైబర్ నేరాలకు గురైన వ్యక్తులు వెంటనే 1930 కి సమాచారం అందించాలని, లేదా NCRP పోర్టల్(www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయాలని సీఐ సూచించారు. పోయిన డబ్బులను తిరిగి పొందే అవకాశాలు ఉండాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ ఎస్సై కళ్యాణ్ కుమార్, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

diplomatic efforts intensify as usa and iran consider a temporary ceasefire plan

Usa-Iran | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు చెక్?…అమెరికా-ఇరాన్ మధ్య కొత్త పరిణామం

Usa-Iran: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ఉపశమనం కలిగించే దిశగా అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై చర్చలు ముందుకు సాగుతున్నట్టు అంతర్జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మధ్యవర్తి దేశాలు సిద్ధం...
- Advertisement -
Chat on WhatsApp