Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeTelanganaJangaonజనగామ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ ప్రారంభం

జనగామ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియ ప్రారంభం

-

Chat on WhatsApp

జనగామ జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, (రెవెన్యూ) రోహిత్ సింగ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే)ను చేపట్టిందన్నారు. ఈ సర్వే ప్రక్రియలో భాగంగా జిల్లాల్లో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు ఇంటింటి జాబితా రూపొందిస్తున్నామన్నారు. ఈ నెల 9 నుంచి సమగ్ర ఇంటింటి సర్వే నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని, 18వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. జిల్లాలో ఈ సర్వేకు నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పింకేష్ కుమార్, పర్యవేక్షణ అధికారిగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ లు వ్యవహరిస్తారన్నారు. ఈ సర్వే పట్ల జిల్లా యంత్రాంగం ఎంతగానో శ్రమిస్తోందన్నారు. ఈ సర్వే ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని, అందుకోసం మూడంచెల పర్యవేక్షణ టీమ్ లను నియమించినట్లు పేర్కొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp