ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి భూ సమస్యలు, రెండు పడక గదుల ఇల్లు వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ ఆర్జీలను సమర్పించారు.
ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు సీఎం ప్రజావాణి దరఖాస్తులను పర్యవేక్షించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు
