Cm Revanth reddy: బాసరలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ వేడుక ఘనంగా జరిగింది. పర్యటన ప్రారంభంలో వారు సరస్వతి అమ్మవారి క్షేత్రం చేరి, వేద పండితుల పూర్ణకుంభ స్వాగతాన్ని పొందారు. తరువాత, రేవంత్ రెడ్డి దంపతులు తమ మనవడు రుద్ర దేవ్(Rudra Dev) కోసం అక్షరాభ్యాసం(Aksharabhyasam) నిర్వహించారు.
ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ మహారాజ్ పలక బలపంతో ముఖ్యమంత్రి మనుమడికి అక్షరాభ్యాసం చేశారు. వేద పండితులు కలిసి ఆశీర్వాదం అందించారు.
ఈ వేడుకలో కుమార్తె నైమిశా రెడ్డి, దంపతులు, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొజ్జు పటేల్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ, రాజకీయ వర్గాలు మరియు స్థానిక ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్షరాభ్యాసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.








