Tuesday, March 24, 2026
Chat on WhatsApp
HomeNationalAyodhya News | శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవానికి ప్రత్యేక కానుక

Ayodhya News | శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవానికి ప్రత్యేక కానుక

-

Chat on WhatsApp

Golden Ram Dhanush: అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడికి ఒడిశా భక్తులు అపూర్వమైన భక్తిని చాటుకున్నారు. బాలరాముడికి  బహుమతిని  సిద్ధం చేశారు.

ఈ సందర్బంగా  శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు రెండేళ్లు పూర్తవుతున్న వేళా సుమారు 286 కిలోల బరువున్న మహా స్వర్ణ రామధనుస్సును(Golden Ram Dhanush) అయోధ్య రాముడికి  సమర్పించేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ విశిష్టమైన కళాఖండాన్ని ఒడిశా రాష్ట్రం రూర్కెలాలో అత్యంత నైపుణ్యంతో రూపొందించారు.

ఈ స్వర్ణ ధనుస్సు తయారీలో ఒక కిలో స్వచ్ఛమైన బంగారం, రెండున్నర కిలోల వెండి, అలాగే రాగి, జింక్, ఇనుము వంటి లోహాల మిశ్రమాన్ని వినియోగించారు. దీని నిర్మాణానికి సుమారు రూ.1.10 కోట్ల వ్యయం అయినట్లు సమాచారం.

ALSO REAAAD:Legends Reunion: భారత క్రికెట్ గోల్డెన్ మెమరీస్.. లెజెండ్స్ రీయూనియన్ ఫోటో వైరల్

సుమారు 8 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో రూపొందిన ఈ ధనుస్సు అత్యంత గంభీరంగా, కళాత్మకంగా దర్శనమిస్తుంది.

పూరీ జగన్నాథ స్వామి–అయోధ్య శ్రీరాముడి మధ్య ఆధ్యాత్మిక అనుబంధాన్ని ప్రతిబింబించేలా, ఈ ధనుస్సుపై జగన్నాథ స్వామి ప్రతిమను, ప్రత్యేక ఫిలిగ్రీ కిరీటాన్ని సున్నితమైన శిల్పకళతో చెక్కారు. సనాతన జాగరణ మంచ్ ఆధ్వర్యంలో ఈ స్వర్ణ ధనుస్సును ఒడిశాలోని పలు జిల్లాల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు.

పూరీ క్షేత్రంలో సంప్రదాయబద్ధమైన పూజలు, పవిత్ర క్రతువులు పూర్తైన అనంతరం, ఈ స్వర్ణ ధనుస్సు శోభాయాత్రగా అయోధ్య దిశగా బయలుదేరింది.

జనవరి 22న, శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు రెండేళ్లు పూర్తయ్యే వార్షికోత్సవ సందర్భంగా, ఈ మహా స్వర్ణ రామధనుస్సును బాలరాముడి పాదాల చెంత భక్తిశ్రద్ధలతో సమర్పించనున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

హైదరాబాద్ మెట్రో ఇక పూర్తిగా సర్కారుదే..

హైదరాబాద్: నగర ప్రయాణికులకు జీవనాడిగా మారిన 'హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail)' ఇక పూర్తిగా తెలంగాణ ప్రభుత్వపరం కాబోతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) కొనసాగిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును...
- Advertisement -
Chat on WhatsApp