Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshAmaravati | అమరావతికి చట్టబద్ధతపై దుర్గమ్మకు మొక్కులు చెల్లించిన రాజధాని రైతులు

Amaravati | అమరావతికి చట్టబద్ధతపై దుర్గమ్మకు మొక్కులు చెల్లించిన రాజధాని రైతులు

-

Chat on WhatsApp

Amaravati: అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన మహిళలు, రైతులు భక్తి, భావోద్వేగాలతో విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభించిన నేపథ్యంలో, అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి వారు కాలినడకన ఇంద్రకీలాద్రి చేరుకున్నారు.

ఈ సందర్భంగా మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, పూలు, చీర, సారెలను అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందాలని, అమరావతి సుభిక్షంగా ఉండాలని వారు దుర్గమ్మను ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతినే ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా చర్యలు వేగవంతం కావడం, అలాగే రాజధానికి చట్టబద్ధత లభించడం పట్ల రైతులు, మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వారు ఈ భక్తి యాత్ర చేపట్టినట్లు తెలిపారు.

అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనకదుర్గమ్మ వారధి నుంచి ఇంద్రకీలాద్రి వరకు ‘జై అమరావతి’ నినాదాలతో ప్రాంతమంతా మార్మోగింది. భక్తి, భావోద్వేగం, రాజధాని ఆకాంక్ష. ఈ యాత్ర అమరావతి ఉద్యమానికి మరో ప్రతీకాత్మక ఘట్టంగా నిలిచింది.

రాజధాని కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న రైతులు, మహిళలు ఈ దర్శనాన్ని కేవలం ఆధ్యాత్మిక యాత్రగా కాకుండా, తమ ఆశయానికి లభించిన న్యాయపరమైన గుర్తింపుపై ఆనందోత్సవంగా భావించారు.

అమరావతి భవిష్యత్తు బలంగా ఉండాలని, రాజధాని ప్రాంత ప్రజల ఆకాంక్షలు పూర్తిగా నెరవేరాలని వారు అమ్మవారిని వేడుకున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

viral andhra pradesh 28 districts map claimed as apsdma release found to be fake

APSDMA | సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏపీ కొత్త మ్యాప్‌పై APSDMA స్పష్టత

APSDMA: ఆంధ్రప్రదేశ్‌కు 28 జిల్లాలతో కొత్త మ్యాప్‌ విడుదలైందన్న ప్రచారం పూర్తిగా అసత్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టం చేసింది. ఇటీవల సోషల్ మీడియా వేదికల్లో, అలాగే కొన్ని...
- Advertisement -
Chat on WhatsApp