Air India Plane Crash Insurance: అహ్మదాబాద్లో గత సంవత్సరం చోటుచేసుకున్న “ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం” (Air India Plane )నేపథ్యంలో విమానయాన సంస్థకు భారీ బీమా పరిహారం లభించింది. ఇన్సూరెన్స్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రమాదానికి సంబంధించి బీమా కంపెనీలు మరియు రీఇన్సూరర్లు కలిసి “రూ.1,100 కోట్లకు పైగా” మొత్తాన్ని ఎయిర్ ఇండియాకు చెల్లించారు. ఈ విషయాన్ని ఆంగ్ల మీడియా కథనాలు కూడా ధృవీకరించాయి.
వివరాల్లోకి వెళ్తే, “జూన్ 12న గత సంవత్సరం” అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో విమానం సమీపంలోని ఒక మెడికల్ కాలేజీ హాస్టల్పై పడటంతో తీవ్ర నష్టం సంభవించింది.
ఈ ఘోర ఘటనలో విమానం పూర్తిగా ధ్వంసమవ్వడంతో, బీమా సంస్థలు “125 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,100 కోట్లకు పైగా)”పరిహారంగా చెల్లించాయి. అదనంగా, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారంగా “25 మిలియన్ డాలర్లు” చెల్లించే ప్రక్రియను కూడా ప్రారంభించారు.
అయితే ఈ మొత్తం ఇంకా పూర్తిగా చెల్లించాల్సి ఉందని ఇన్సూరెన్స్ వర్గాలు వెల్లడించాయి. పరిస్థితుల ఆధారంగా భవిష్యత్తులో ఈ పరిహార మొత్తం మరింత పెరిగే అవకాశముందని కూడా సమాచారం.
also read:Gold Rates Today | పసిడి మగువలకు మళ్ళీ షాక్….పెళ్లిళ్ల సీజన్లో బంగారం దూకుడు
