Wednesday, April 8, 2026
Chat on WhatsApp
HomeTelanganaSiddipetకొమురవెల్లి ఆలయ దగ్గర వీరంగం సృష్టించిన అఘోరి

కొమురవెల్లి ఆలయ దగ్గర వీరంగం సృష్టించిన అఘోరి

-

Chat on WhatsApp

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లి మల్లన్న ఆలయ పరిసరాల్లో ఓ అఘోరి వీరంగం సృష్టించాడు. ఆలయం ఎదుట ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేయడం, అక్కసుతో రిపోర్టర్ మొబైల్ ధ్వంసం చేయడం కలకలం రేపాయి. ఆలయానికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న చేర్యాల పోలీసులు ఆలయానికి చేరుకుని పరిస్ధితిని నియంత్రించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఘటనను పరిశీలించారు. అఘోరి చేస్తున్న అరాచకాలకు భక్తులు భయపడుతున్నారని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అఘోరి పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వ్యక్తిపై దాడి, పబ్లిక్ ప్రాపర్టీ ధ్వంసం, శాంతిభద్రతల భంగం కింద నేరపత్రిక నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఈ ఘటన ఆలయ భద్రతపై కొత్త ప్రశ్నలు లేవనెత్తింది. భక్తుల రక్షణ కోసం ఆలయం వద్ద పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా, అఘోరి గత రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

lpg gas cylinders and online booking concept showing smooth domestic gas supply in india

LPG Gas Cylinder | ఎల్పీజీ బుకింగ్‌లో భారీ మార్పులు.. వినియోగదారులకు మరో ఊరట

LPG Gas Cylinder: దేశంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పంపిణీ ప్రక్రియను మరింత బలోపేతం చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం...
- Advertisement -
Chat on WhatsApp