Saturday, March 21, 2026
Google search engine
HomeTelangana“యాదగిరిగుట్ట లాడ్జిలో మైనర్ బాలికలపై లైంగికదాడి – ముగ్గురు యువకులు, లాడ్జి యజమాని అరెస్ట్”

“యాదగిరిగుట్ట లాడ్జిలో మైనర్ బాలికలపై లైంగికదాడి – ముగ్గురు యువకులు, లాడ్జి యజమాని అరెస్ట్”

-

Google search engine

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సరదాగా గడిపేందుకు ఇంటి నుంచి బయలుదేరిన ముగ్గురు మైనర్ బాలికలు అఘాయిత్యానికి గురైన ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహం రేపుతోంది.

అల్వాల్ పోలీసుల కథనం ప్రకారం, తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు ఈ నెల 20న పాఠశాలలో బతుకమ్మ వేడుకలున్నాయని చెప్పి ఉదయం ఇంటి నుంచి బయలుదేరారు. తల్లిదండ్రులకు స్కూల్‌కి వెళ్తున్నామని నమ్మబలికిన ఈ ముగ్గురు బాలికలు సికింద్రాబాద్ మీదుగా ఉస్మానియా యూనివర్సిటీ బస్టాప్‌కి చేరుకున్నారు. అక్కడ ఇప్పటికే ఉన్న ఒక యువకుడు (GHMC కాంట్రాక్టు ఉద్యోగి, వయసు 19 ఏళ్లు) వారితో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం తన ఇద్దరు స్నేహితులను కూడా అక్కడికి పిలిపించాడు. ముగ్గురు యువకులు బాలికలను నమ్మించి, “తమూ యాదగిరిగుట్టకు వెళ్తున్నామని” చెప్పి, వారిని బస్సులో తీసుకువెళ్లారు.

యాదగిరిగుట్ట ఆలయ దర్శనం అనంతరం, ముగ్గురు యువకులు అక్కడి లాడ్జిలో ఒక గదిని అద్దెకు తీసుకున్నారు. అదే గదిలో బాలికలపై లైంగికదాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపించారు. ఈ ఘోర సంఘటన తర్వాత మరుసటి రోజు (21వ తేదీ) తిరిగి హైదరాబాద్ వచ్చి, బాలికలను ఓస్మానియా యూనివర్సిటీ వద్ద వదిలేసి నిందితులు వెళ్లిపోయారు.

అంతలో బాలికలు పాఠశాలకు రాకపోవడంతో ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, బాలికలు ఫోన్‌లో సంప్రదించడంతో అసలు విషయాన్ని తెలుసుకున్నారు. తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో బాలికలు జరిగిన అఘాయిత్యాన్ని కన్నీళ్లతో వివరించారు.

ఈ విషయం బయటపడిన వెంటనే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదే కాకుండా, బాలికలు మైనర్లు అని తెలిసినా గదిని అద్దెకు ఇచ్చిన లాడ్జి యజమాని సోమేశ్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. మైనర్ బాలికలను మోసపూరితంగా తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలపై మరింత శ్రద్ధ పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. చిన్న వయసులోనే ఇలాంటి సంఘటనలు జరగడం సమాజానికి కలవరం కలిగించే విషయమని, బాధిత బాలికలకు న్యాయం చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine