Wednesday, March 25, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshతిరుమలలో ఆరు కిలోల బంగారంతో భక్తుడు హైలైట్

తిరుమలలో ఆరు కిలోల బంగారంతో భక్తుడు హైలైట్

-

Chat on WhatsApp

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తి, ఆధ్యాత్మికత, అద్భుత దృశ్యాలతో సాగుతున్న తరుణంలో, హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ఒంటిపై ధరించిన ఆరు కిలోల బంగారు ఆభరణాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్ తన వైభవంతోనే కాదు, భక్తితో కూడిన నమ్మకంతోనూ అందరినీ ఆకట్టుకున్నారు.

విజయ్ కుమార్ మెడలో భారీ బంగారు గొలుసులు, చేతులపై కడియాలు, వేల్లలో ఉంగరాలు, చేతి గడియారాలు, శరీరంపై బంగారు అలంకరణలతో తిరుమాడ వీధుల్లో సంచరించారు. ఆరునాలుగు కిలోల బంగారంతో దర్శనానికి రావడం చూస్తూ, ఆయనను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. చాలామంది అతనితో సెల్ఫీలు తీసుకోవడానికి తహతహలాడారు. కొంతమంది ఫోటోలు తీసేందుకు మొబైల్ ఫోన్లతో పరుగులు పెట్టారు.

విజయ్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా మారిన ఈ సంఘటనకు బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకి వచ్చిన ఇతర భక్తుల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు ఇది వ్యక్తిగత భక్తి ప్రదర్శనగా భావించగా, మరికొందరు ఇంత విలువైన ఆభరణాలతో తిరగడం ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. తిరుమలలో ఇప్పటికే భారీ భక్త జనసందోహం ఉండటంతో పోలీసులు జాగ్రత్త చర్యలుగా విజయ్ కుమార్‌ను అప్రమత్తం చేశారు. అంతటి విలువైన ఆభరణాలతో తిరగకూడదని సూచించారు.

పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో విజయ్ కుమార్ తన భక్తిని వ్యక్తీకరించడానికే ఇలా చేశానని, భద్రతపై పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నానని వెల్లడించారు. ఆయనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పలు ప్లాట్‌ఫామ్స్‌లో ఆయనను చూసిన నెటిజన్లు తమ కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. “బంగారు భక్తుడు,” “గోల్డ్ మాన్ ఆఫ్ తిరుమల,” అంటూ అనేక పేర్లు పెట్టేస్తున్నారు.

తిరుమల బ్రహ్మోత్సవాల వేళ ఇలాంటి ఘటనలు భక్తుల మధ్య ఆసక్తికరమైన చర్చలకు దారి తీస్తున్నాయి. ఇది భక్తి, వైభవం కలగలిపిన విశిష్ట సంఘటనగా నిలిచింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp