ట్రంప్ ఆరోపణల వెనుక నిజం ఏంటి? ‘టారిఫ్ కింగ్’ వివరణ!


‘‘భారత్ టారిఫ్ కింగ్’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ఆరోపించారు. కానీ ఆయన వ్యాఖ్యల వెనుక వాస్తవాలు ఏంటి? నిజంగానే భారత్ ప్రపంచంలో అత్యధిక సుంకాలను విధిస్తున్నదా?

ఈ వీడియోలో ట్రంప్ ఆరోపణలకు గణాంకాలతో సమాధానం చెబుతున్నాం. వరల్డ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం భారత్ సాధారణ సగటు సుంకం 15.98% అయినప్పటికీ, వాణిజ్య ఆధారిత సగటు సుంకం కేవలం 4.6% మాత్రమే. అంటే భారత్ చాలా తక్కువ సుంకాలను మాత్రమే వసూలు చేస్తోంది.

అమెరికా నుంచి వచ్చే ప్రధాన ఉత్పత్తులపై 5-8 శాతమే సుంకాలు వసూలు అవుతున్నాయి. పైగా SEZలు, FTA ఒప్పందాల ద్వారా చాలా ఉత్పత్తులు టాక్స్ లేకుండా వస్తున్నాయి. భారత్‌కు “టారిఫ్ కింగ్” అనే బిరుదు తగినది కాదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక స్విట్జర్లాండ్ (28.5%), నార్వే (31.1%), దక్షిణ కొరియా (57%) వంటి అభివృద్ధి చెందిన దేశాలు రైతాంగ పరిరక్షణ కోసం భారత్ కన్నా ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయి. అలా అయితే అభివృద్ధి చెందుతున్న భారత్‌పై విమర్శలు ఎందుకు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *