‘‘భారత్ టారిఫ్ కింగ్’’ అని అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ఆరోపించారు. కానీ ఆయన వ్యాఖ్యల వెనుక వాస్తవాలు ఏంటి? నిజంగానే భారత్ ప్రపంచంలో అత్యధిక సుంకాలను విధిస్తున్నదా?
ఈ వీడియోలో ట్రంప్ ఆరోపణలకు గణాంకాలతో సమాధానం చెబుతున్నాం. వరల్డ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం భారత్ సాధారణ సగటు సుంకం 15.98% అయినప్పటికీ, వాణిజ్య ఆధారిత సగటు సుంకం కేవలం 4.6% మాత్రమే. అంటే భారత్ చాలా తక్కువ సుంకాలను మాత్రమే వసూలు చేస్తోంది.
అమెరికా నుంచి వచ్చే ప్రధాన ఉత్పత్తులపై 5-8 శాతమే సుంకాలు వసూలు అవుతున్నాయి. పైగా SEZలు, FTA ఒప్పందాల ద్వారా చాలా ఉత్పత్తులు టాక్స్ లేకుండా వస్తున్నాయి. భారత్కు “టారిఫ్ కింగ్” అనే బిరుదు తగినది కాదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇక స్విట్జర్లాండ్ (28.5%), నార్వే (31.1%), దక్షిణ కొరియా (57%) వంటి అభివృద్ధి చెందిన దేశాలు రైతాంగ పరిరక్షణ కోసం భారత్ కన్నా ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయి. అలా అయితే అభివృద్ధి చెందుతున్న భారత్పై విమర్శలు ఎందుకు?
