Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకోల్‌కతా ఆర్టీసీ డ్రైవర్లు హెల్మెట్లు ధరించి డ్యూటీ

కోల్‌కతా ఆర్టీసీ డ్రైవర్లు హెల్మెట్లు ధరించి డ్యూటీ

-

Chat on WhatsApp

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా, కూచ్ బెహర్ సిటీలలో బుధవారం ఆర్టీసీ బస్ డ్రైవర్లు హెల్మెట్లు ధరించి డ్యూటీ చేశారు. ప్రభుత్వ బస్సులలో దాదాపుగా డ్రైవర్లు అందరూ హెల్మెట్లు పెట్టుకుని బస్సు నడపడం కనిపించింది. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బైక్ నడుపుతున్నపుడు హెల్మెట్ తప్పనిసరి కానీ బస్సు నడపడానికి హెల్మెట్ ఎందుకని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక మీడియా సంస్థల ప్రతినిధులు డ్రైవర్లను కదిలించగా.. ప్రభుత్వమే తమను హెల్మెట్ పెట్టుకోమని చెప్పిందని వివరించారు. డ్యూటీ ఎక్కేముందు ఉన్నతాధికారులు స్వయంగా తామందరికీ హెల్మెట్ ఇచ్చారని చెప్పారు.

కారణం ఏంటంటే..
కోల్ కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఇటీవల ట్రెయినీ డాక్టర్ ఒకరు దారుణ హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండగా.. మంగళవారం కోల్ కతాలో విద్యార్థులు మెగా నిరసన ర్యాలీ తీశారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో అదికాస్తా హింసాత్మకంగా మారింది. అటు పోలీసులు, ఇటు నిరసనకారులు గాయాలపాలయ్యారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. గాలిలోకి కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ బుధవారం 12 గంటల బెంగాల్ బంద్ కు పిలుపునిచ్చింది. ప్రజలంతా స్వచ్చందంగా బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఈ బంద్ పిలుపును ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని, ఎలాగైనా బంద్ ను విఫలం చేయాలని అధికారులను ఆదేశించింది. సెలవులో ఉన్నవారు, అత్యవసర పరిస్థితులలో తప్ప ప్రభుత్వ ఉద్యోగులంతా విధులకు హాజరవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో బంద్ కారణంగా ఆర్టీసీ డ్రైవర్లపై దాడులు జరిగే అవకాశం ఉందనే ఆలోచనతో హెల్మెట్లు ధరించి డ్యూటీ చేయాలని సూచించింది. దీంతో బస్ డిపోలలో ఉన్నతాధికారులు ఆర్టీసీ డ్రైవర్లకు హెల్మెట్లు అందజేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Srikakulam to Tirupati direct weekly train service launched after 75 years

Srikakulam to Tirupati | 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
- Advertisement -
Chat on WhatsApp