Medaram Jatara: నేటి నుంచి సమ్మక్క–సారలమ్మ మహాజాతర
Medaram Jatara: దేశంలోనే అతి విశాలమైన గిరిజన ఆధ్యాత్మిక ఉత్సవంగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర నేటి నుంచి ప్రారంభమైంది. రెండేళ్లకోసారి అపూర్వ వైభవంతో నిర్వహించే ఈ మహాజాతరలో కోట్లాది భక్తుల ఆరాధ్యదైవాలైన సమ్మక్క–సారలమ్మ తల్లులు గద్దెలపై కొలువుదీరనున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ జాతర ఈ నెల 31 వరకు కొనసాగనుంది. జాతర నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్లను వెచ్చించి తల్లుల గద్దెల ప్రాంతాన్ని పూర్తిగా పునర్నిర్మించడంతో పాటు భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించింది….
