సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని మహాగణపతి దేవాలయంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి విగ్రహానికి విశేష అలంకరణ చేసి, భక్తుల కోసం తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడింది.
స్వప్న బిక్షపతి యాదవ్ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు మహా అన్నప్రసాదాన్ని అందజేశారు. పూజా కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శాస్త్రోక్తంగా హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. గణపతి మంత్రోచ్చారణలతో ఆలయం భక్తి మయంగా మారింది.
ఈ కార్యక్రమంలో ఇందిరా ప్రభాకర్, కుర్ర సాయి రెడ్డి, పొద్దుటూరు నరేందర్, మామిడి సురేష్ గౌడ్, కుర్రే కరుణాకర్ రెడ్డి, పూదరి నర్సింలు, వెంకటేశం, డాక్టర్ యల్లేష్ తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణపతిని దర్శించుకున్నారు.
విశేష పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆలయ కమిటీ సభ్యులు, భక్తులను నిర్వాహకులు అభినందించారు.








