ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీనివాసపురం రోడ్డు బైపాస్ వద్ద ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు ఇసుకను తోలుకోనివ్వకుండా తమపై అక్రమంగా కేసులు బలాయిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక డ్రైవరు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయానికి పాల్పడ్డాడు. తోటి డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోబోయే నా డ్రైవర్ను వారించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పోలీసులు ఉన్నప్పటికీ ఇసుక ట్రాక్టర్ డ్రైవర్లు ఆందోళన చేశారు. తమను పోలీసులు ఇసుకను తోలుకొనివ్వకుండా అడ్డుకుంటున్నారని తమకు జీవనోపాధి కల్పించకుండా ఇటువంటి చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు అంటూ ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు.







