కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మద్ది చంద్రకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమం లో ముఖ్యతిధిగా పాల్గొన జిల్లా ఇంచార్జి ఎక్స్చేంజ్ , పర్యటన శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు , ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ అలీ , ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాలలో ప్రాధాన్యం కల్పిస్తుందని అన్నారు.ప్రజా పాలన కార్యక్రమం చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరుగుతుందని , ఎన్నికలలో ఇచ్చిన అన్ని గ్యారెంటీలను అమలు పరచడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని అన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు , 10 లక్షల వరకు ఆరోగ్య భీమా అందించడం జరుగుతుందని , రాబోవు రోజులలో జిల్లాలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు కూడా అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే రైతన్నలకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని , రెండు లక్షల పైన రుణమున్న వారికి కూడా రుణమాఫీ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాస్ , మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , సుభాష్ రెడ్డి పలువురు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం
RELATED ARTICLES








