మహారాష్ట్రలోని నాగ్పూర్ పార్ది ప్రాంతంలో చిరుత ఆగమనం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. పట్టపగలే నివాస ప్రాంతంలోకి ప్రవేశించిన చిరుత అకస్మాత్తుగా పరుగులు తీస్తూ ప్రజలపై దాడి చేయడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో హడావుడి చెలరేగింది.
ఈ దాడిలో మొత్తం ఏడుగురు గాయపడ్డారు. చిరుతను చూసిన స్థానికులు భయంతో పరుగులు తీయగా, కొందరిని అది గాయపడేలా దాడి చేసినట్లు సమాచారం.
ALSO READ:Surat Fire Accident | సూరత్ టెక్స్టైల్ బిల్డింగ్లో భారీ అగ్ని ప్రమాదం
స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక బృందంతో అక్కడికి చేరుకుని చిరుతను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మత్తు ఇంజక్షన్ వాడి చిరుతను విజయవంతంగా బంధించారు. అనంతరం దానిని అడవికి తరలించారు.
చిరుత అల్లరి, దాడి దృశ్యాలు, అధికారులు చేపట్టిన ఆపరేషన్కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు ఇంకా భయాందోళనలోనే ఉన్నారు.
