Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeRangareddyLal Bahadur Nagaవిద్యుత్ షాక్‌తో మైనర్ బాలిక మృతి – బాలాపూర్‌లో విషాదం

విద్యుత్ షాక్‌తో మైనర్ బాలిక మృతి – బాలాపూర్‌లో విషాదం

-

Chat on WhatsApp

మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సాహినగర్ ప్రాంతంలోని అలీనగర్ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలిక విద్యుత్ ఘాత్కానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

పోలీసుల వివరాల ప్రకారం, ఫాతిమా అనే బాలిక వాషింగ్ మిషన్ ఆన్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మిషన్‌లో నీరు పోసిన తర్వాత, తెగిపోయి ఉన్న విద్యుత్ ఎక్స్టెన్షన్ వైర్లను గమనించకుండా స్విచ్ ఆన్ చేయడంతో ఆమె విద్యుత్ షాక్‌కు గురైంది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించింది.

బాలిక తల్లి షా నవాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ ఎస్సై శ్రీనివాస కేసు నమోదు చేశారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఈ విషాద ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. విద్యుత్ వైర్ల విషయంలో నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ ఘటన కుటుంబసభ్యులను విషాదంలో ముంచేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp