Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeTelanganaJangaonపల్లగుట్టలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కడియం శ్రీహరి

పల్లగుట్టలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కడియం శ్రీహరి

-

Chat on WhatsApp

చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో, వెంకటాద్రి పేట గ్రామములో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే రైతులకు న్యాయం జరుగుతోందని అన్నారు.. రైతులకు 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతోందన్నారు. రానున్న రోజుల్లో వారికి అనేక సంక్షేమ ఫలాలు అందనున్నాయని తెలిపారు. పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలన్నారు. ధాన్యం ఏ గ్రేడ్ 2,320, బీ గ్రేడ్ 2,300, సన్నరకానికి అదనంగా 500 బోనస్ చెల్లిస్తామన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. . గత ప్రభుత్వాలు ప్రభుత్వపరంగా రావాల్సిన సబ్సిడీలను అందించలేదని విమర్శించారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని అన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

deloitte hiring 50000 employees in india amid global tech layoffs and ai transition

Deloitte Hiring | లేఆఫ్స్ ఒకవైపు.. హైరింగ్ మరోవైపు.. భారత్‌పై డెలాయిట్ భారీ ఫోకస్

Deloitte Hiring: టెక్ రంగంలో ఒకవైపు భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగుతుండగా, మరోవైపు నియామకాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 30,000 ఉద్యోగాలను తగ్గించినట్లు నివేదికలు వెలువడగా, అదే...
- Advertisement -
Chat on WhatsApp