Tuesday, March 24, 2026
Chat on WhatsApp
HomeCrime Newsగరికపాటి నరసింహారావుపై తప్పుడు ప్రచారంపై ఆగ్రహం

గరికపాటి నరసింహారావుపై తప్పుడు ప్రచారంపై ఆగ్రహం

-

Chat on WhatsApp

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన టీమ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గరికపాటిపై వారు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని, ఈ దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. వేర్వేరు సందర్భాల్లో ఆయన క్షమాపణలు చెప్పినట్టు చూపిస్తూ, ఆయన గౌరవానికి భంగం కలిగించేలా సమాచారాన్ని వక్రీకరిస్తున్నారని పేర్కొన్నారు.

గరికపాటి పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన టీమ్ వెల్లడించింది. ఇలా నిరాధార ఆరోపణలు చేసే వ్యక్తులు, యూట్యూబ్ ఛానళ్లపై పరువునష్టం కేసులు వేయాలని తమ నిర్ణయం స్పష్టం చేసింది. ఈ తప్పుడు ప్రచారంతో గరికపాటి కుటుంబ సభ్యులు, ఆయన అనుయాయులు తీవ్ర కలత చెందుతున్నారని తెలిపారు.

ప్రజలకు మంచి సందేశం అందించేందుకు ప్రవచనాలు చేసే గరికపాటిపై ఈ విధమైన ప్రచారం నిరాధారమని, మానసికంగా కూడా వారి కుటుంబానికి ఇబ్బందికరంగా మారిందని వారు తెలిపారు. దుష్ప్రచారం వల్ల పేరుకు వచ్చిన నష్టం కోసం చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

గరికపాటి నరసింహారావు అభిమానులు, అనుయాయులు కూడా ఈ దుష్ప్రచారంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యక్తిత్వానికి భంగం కలిగించే ప్రయత్నాలను నిరసించడంతో పాటు, నిజమైన సమాచారం మాత్రమే అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

పసిడిపై పశ్చిమాసియా యుద్ధ సెగ..

బిజినెస్ డెస్క్: ఈ ఏడాది ఆరంభంలో ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు క్రమంగా దిగొస్తూ కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి....
- Advertisement -
Chat on WhatsApp