దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శాస్త్రి నగర్ హనుమాన్ ఆలయంలో ఏర్పాటుచేసిన అమ్మవారిని లలిత పరమేశ్వరి రూపంలో అలంకరించారు . అమ్మవారికి రంగురంగుల గాజులతో అలంకరించి మహిళలందరూ కలిసి కుంకుమార్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారు తమ పిల్లలను కుటుంబాలను సుఖసంతోషాలతో పసుపు కుంకుమలతో ఆయురారోగ్యాలతో చల్లగా చూడాలని వేడుకున్నారు. ఈ పూజ కార్యక్రమాన్ని అనురాగ్ శర్మ నిర్వహించారు.








