Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaKhammamబిజెపిపై తీవ్ర విమర్శలు చేసిన సిపిఎం నాయకులు

బిజెపిపై తీవ్ర విమర్శలు చేసిన సిపిఎం నాయకులు

-

Chat on WhatsApp

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో సిపిఎం పార్టీ 22వ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ తర్వాత పార్టీ జెండా ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ, బిజెపి జమిలి ఎన్నికలతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే కుట్రలు పన్నుతోందని ఆక్షేపించారు. బిజెపి మతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, మతతత్వ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటోందని విమర్శించారు.

ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, బిజెపిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ను సమర్థించామే తప్ప, ఆ పార్టీపై విశ్వాసం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన దారుణాలకు, ప్రస్తుత సమస్యలకు కాంగ్రెస్ పార్టీనే కారణమని పేర్కొన్నారు. సిపిఎం కార్యకర్తలపై అరెస్టులు చేయించిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.

మూసి నది ప్రక్షాళన పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, సిపిఎం నిశబ్దంగా ఉండదని తమ్మినేని హెచ్చరించారు. ఫార్మా కంపెనీల నుండి వచ్చే విష జలాలతో మూసి విషపూరితమైందని, ఈ విషయంలో కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా మౌనం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు.

సమావేశం చివరిలో, కేసీఆర్, రేవంత్ రెడ్డి రాజకీయ కుట్రలను ప్రజలు అధిగమిస్తారని, ఎర్రజెండాకు మళ్లీ మంచి రోజులు వస్తాయని సిపిఎం నాయకులు తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడుతూ, ప్రజల సమస్యలకు పరిష్కారం అందించడమే సిపిఎం లక్ష్యమని ప్రకటించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp