Monday, April 6, 2026
Chat on WhatsApp
HomeTelanganaMedakమంత్రాల నెపంతో మహిళపై దారుణ దాడి

మంత్రాల నెపంతో మహిళపై దారుణ దాడి

-

Chat on WhatsApp

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో మంత్రాల నెపంతో ఓ మహిళను చితకబాదిన సంఘటన మరువకముందే ఇదే మండలం కాట్రియాల గ్రామంలో అర్థరాత్రి దారుణంచోటుచేసుకుంది.
కాట్రియాల గ్రామానికి చెందిన డేగల ముత్తవ్వ(50) మంత్రాలు చేస్తుందన్న నెపంతో ఇంటి పక్కన వారు గ్రామస్తులు కొందరు చితక బాది పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. ఈ ఘటన ఆమె కొడుకు కోడలు కళ్ళముందే జరిగిన ఎంత అరిసిన చుట్టుపక్కల వారు రాలేరని తమ పాలోలే ఈ ఘటనకు పాల్పడ్డారని కుమారుడు రవి తెలిపారు ఘటన స్థలానికి చేరుకున్న తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి,రామాయంపేట సిఐ వెంకట రాజగౌడ్ తీవ్రగాయాల పాలైన డేగల ముత్తవ్వ(50)ను వైద్యం కోసం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.
మృతదేహాన్ని రామాయంపేట ఆసుపత్రికి తరలించినారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp