కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు.మాజీ ఎంపీపీ నారెడ్డి.దశరథ్ రెడ్డి మాట్లాడుతూ : బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించిన ధర్నా నిర్వహించారు.అరెస్ట్ చేసిన గిరిజన రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి కూతురు అల్లుడు ఫార్మా కంపెనీ కోసం పేద ప్రజల భూములు లాక్కోవడం దారుణమని అన్నారు. పెద ప్రజల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఖాయమనిఅన్నారు.అన్యాయంగా అరెస్ట్ చేసిన గిరిజన రైతులను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు , గిరిజన నాయకులు పాల్గొన్నారు.
రామారెడ్డిలో గిరిజన రైతుల కోసం బిఆర్ఎస్ ధర్నా
