Redmi Note 15 Pro: Redmi భారత్లో తన కొత్త “Redmi Note 15 Pro సిరీస్” లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. Xiaomi సబ్-బ్రాండ్ అయిన Redmi, ఈ సిరీస్ను “జనవరి 29న భారత్లో విడుదల చేయనున్నట్లు” వెల్లడించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రత్యేక మైక్రోసైట్ను కూడా ప్రారంభించింది. ఈ ఫోన్లు Xiaomi ఇండియా ఆన్లైన్ స్టోర్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
Redmi Note 15 Pro 5G స్మార్ట్ఫోన్కు 200 మెగాపిక్సెల్ ‘మాస్టర్ పిక్సెల్’ రియర్ కెమెరాను అందించారు. ఈ కెమెరాకు “OIS, HDR + AI” సపోర్ట్ ఉండగా, “4K వీడియో రికార్డింగ్” సామర్థ్యం కూడా కల్పించారు. డిజైన్ పరంగా ఈ సిరీస్ బ్రౌన్, గోల్డ్ ఫ్రేమ్, గ్రే కలర్ ఆప్షన్లలో లభించనుంది.
ఫోన్ భద్రత విషయంలో కూడా Redmi ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ స్మార్ట్ఫోన్కు Corning Gorilla Glass Victus రక్షణతో పాటు IP66, IP68, IP69, IP69K డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్లు అందించారు.
పవర్ బ్యాక్అప్ కోసం “6500mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ”, “100W హైపర్చార్జ్”, “22.5W రివర్స్ ఛార్జింగ్” సపోర్ట్ ఉంటుంది. ఈ డివైస్ “Qualcomm Snapdragon 7s Gen 4 (4nm)” చిప్సెట్తో పనిచేస్తుంది. గరిష్టంగా “12GB RAM” వరకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
ALSO READ:Top 4 Unbreakable Records in ODI Cricket | వన్డే ఇంటర్నేషనల్స్లో బ్రేక్ కాని 4 రికార్డులు
