Tuesday, March 24, 2026
Chat on WhatsApp
HomeENTERTAINMENTబిగ్ బాస్‌పై పోలీస్ ఫిర్యాదు – బ్యాన్ డిమాండ్ చేస్తూ యువకుల ఆందోళన

బిగ్ బాస్‌పై పోలీస్ ఫిర్యాదు – బ్యాన్ డిమాండ్ చేస్తూ యువకుల ఆందోళన

-

Chat on WhatsApp

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ప్రసిద్ధ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ పై సంచలన ఫిర్యాదు నమోదు కావడం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గజ్వేల్‌కు చెందిన కమ్మరి శ్రీనివాస్ తో పాటు, రవీందర్ రెడ్డి, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ అనే యువకులు ఈ ఫిర్యాదును చేశారు.

వీరి ఆరోపణల ప్రకారం, బిగ్ బాస్ కార్యక్రమం సమాజంపై తక్కువ స్థాయి ప్రభావాన్ని చూపుతుందని, కుటుంబ విలువలను కించపరిచే విధంగా ప్రదర్శించబడుతున్నదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. షోలో పాల్గొంటున్న కొంతమంది కంటెస్టెంట్లు సామాజిక విలువలు పాటించని వ్యక్తులుగా ఉండటం ద్వారా, నిర్వాహకులు ప్రజలకు తప్పుడు సందేశం పంపిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అశ్లీల సంభాషణలు, హద్దు దాటే ప్రవర్తన, అసభ్య టాస్క్‌లు యువతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, వారు ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలో జరిగినట్లే తెలంగాణలోనూ బిగ్ బాస్‌ను తక్షణం నిషేధించాలని డిమాండ్ చేశారు.

హోస్ట్ నాగార్జున వంటి వారిని కూడా ఈ కార్యక్రమానికి బాధ్యులుగా పేర్కొంటూ, ప్రజలకు మంచి సందేశాలు ఇచ్చే కార్యక్రమాలు చేయాలని సూచించారు. దివ్వెల మాధురి, రీతూ చౌదరి లాంటి వ్యక్తులను సెలెక్ట్ చేయడం ద్వారా షో సామాజిక స్థాయికి హానికరం అవుతోందని అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా, ప్రభుత్వం స్పందించకపోతే, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలతో కలిసి బిగ్ బాస్ హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వివాదంపై మా టీవీ మేనేజ్‌మెంట్ లేదా బిగ్ బాస్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారన్నదే వేచి చూడాల్సిన విషయం. ఈ అభ్యంతరాలు మరియు డిమాండ్ల నేపథ్యంలో షో భవిష్యత్తు ఏమవుతుందో అన్నది తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

హైదరాబాద్ మెట్రో ఇక పూర్తిగా సర్కారుదే..

హైదరాబాద్: నగర ప్రయాణికులకు జీవనాడిగా మారిన 'హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail)' ఇక పూర్తిగా తెలంగాణ ప్రభుత్వపరం కాబోతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) కొనసాగిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును...
- Advertisement -
Chat on WhatsApp