Sunday, March 22, 2026
Google search engine
HomeUncategorizedమొంథా తుపాన్ ప్రభావం: కోనసీమ అతలాకుతలం, పలు జిల్లాల్లో భారీ నష్టం

మొంథా తుపాన్ ప్రభావం: కోనసీమ అతలాకుతలం, పలు జిల్లాల్లో భారీ నష్టం

-

Google search engine

మొంథా తుపాను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీరం దాటిన వెంటనే ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఈ తుపానుతో కోనసీమ, అనకాపల్లి, గుంటూరు, విజయవాడ వంటి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం భీకరరూపం దాల్చి రెండు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతున్నాయి. అలలు లైట్‌హౌస్‌ను తాకుతుండటంతో తీరప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

రాజోలు పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచే ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. ప్రజల భద్రత కోసం విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో గ్రామాల్లో చీకటి అలుముకుంది. రహదారులపై చెట్లు విరిగిపడటంతో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రింబగళ్లు చెట్లు తొలగించి, రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. పల్లిపాలెం గ్రామం పూర్తిగా నీటమునిగిపోయి, వందలాది మత్స్యకార కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నాయి.

అనకాపల్లి జిల్లాలో చోడవరం మండలంలోని ఏటిగట్లు ప్రమాదకరంగా మారాయి. భోగాపురం వద్ద ఉడేరు నదికి వరదలు పోటెత్తడంతో గట్లు కోతకు గురవుతున్నాయి. గండి పడితే సుమారు 500 ఎకరాల్లో పంటలు నాశనం అయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో డెల్టా ప్రాంత రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. కంకుల దశలో ఉన్న వరి పంటలు గాలులు, వర్షాల దెబ్బకు నేలమట్టమయ్యాయి.

విజయవాడ నగరంలో వర్షం తీవ్రంగా కురుస్తుండటంతో వీఎంసీ అధికారులు ఉదయం ఐదు గంటల నుంచే కాలువలు శుభ్రం చేయడంలో నిమగ్నమయ్యారు. నీరు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోకుండా చర్యలు చేపట్టారు. వర్షం తీవ్రత తగ్గితేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

ప్రభుత్వం తుపాను అనంతర పరిస్థితులను సమీక్షిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేసింది. పంట నష్టం అంచనాకు అధికారులు పనిచేస్తున్నారు. వాతావరణం సర్దుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి పరిస్థితులు సమీక్షించనున్నారని సమాచారం. మొంథా తుపాను ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine