Monday, March 23, 2026
Google search engine
HomeTIRUMALAభూమన హయాంలో అవకతవకలపై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్ – స్వామివారి శేషవస్త్రం ఎక్కడికి వెళ్లిందో తేల్చాలి!"

భూమన హయాంలో అవకతవకలపై భానుప్రకాశ్ రెడ్డి ఫైర్ – స్వామివారి శేషవస్త్రం ఎక్కడికి వెళ్లిందో తేల్చాలి!”

-

Google search engine

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి, టీటీడీ మాజీ ఛైర్మన్ మరియు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భూమన హయాంలో అనేక అవకతవకలు జరిగాయని, వాటన్నింటినీ త్వరలో ప్రజల్లోకి తీసుకువస్తామని హెచ్చరించారు. ఆయన హయాంలో ఆలయ పరిపాలనపై అనేక అనుమానాలు ఉన్నాయి అని పేర్కొన్నారు.

భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, లక్షలాది భక్తులు భక్తిశ్రద్ధలతో నమస్కరించే శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రతిష్ఠను దిగజార్చే విధంగా భూమన వ్యవహరించారని ఆరోపించారు. ముఖ్యంగా, స్వామివారి శేషవస్త్రం ఆలయం నుంచి ఎలా బయటికి వెళ్లింది? ఎవరెవరికి అందింది? అనే అంశంపై తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని తెలిపారు. ఇది ఆలయ పరమపవిత్రతను తక్కువ చేసే చర్యగా అభివర్ణించారు.

ఇంకా, నిబంధనల ప్రకారం రంగనాయకుల మండపంలో జరగాల్సిన పరివట్టాన్ని ఎందుకు వెంకయ్య చౌదరి నివాసంలో నిర్వహించారో భూమన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీ నిబంధనలు, ఆలయ సాంప్రదాయాలను పక్కన పెట్టి కొన్ని వ్యవహారాలు జరిగాయనీ, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై పూర్తి ఆధారాలతో కూడిన వివరాలు త్వరలోనే బహిరంగం చేస్తామని, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను కాపాడేందుకు తాము నిరంతరం పాటుపడతామని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -
Google search engine
- Advertisment -
Google search engine

Must Read

telangana high court hearing plea challenging speaker decision on danam nagender disqualification case

Danam Nagender | హైకోర్టులో ఎమ్మెల్యే దానం పార్టీ ఫిరాయింపు కేసు…స్పీకర్ నిర్ణయానికి సవాల్

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టు వరకు చేరడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పార్టీ మారలేదని తెలంగాణ అసెంబ్లీ...
- Advertisement -
Google search engine