Home Andhra Pradesh రాజానగరం పోలీసులు 150 కేజీల గంజాయి పట్టివేత

రాజానగరం పోలీసులు 150 కేజీల గంజాయి పట్టివేత

0
Rajanagaram police seized 150 kg of ganja and arrested five people. A car, auto, and mobile phones were confiscated.
Rajanagaram police seized 150 kg of ganja and arrested five people. A car, auto, and mobile phones were confiscated.

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలంలోని కొంతమూరు అండర్ బ్రిడ్జి వద్ద రాజానగరం పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. పోలీసులకు ముందస్తు సమాచారం రావడంతో వాహన తనిఖీలు నిర్వహించగా, 150 కేజీల గంజాయితోswift dezire కారు, ఒక ఆటోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అధికారుల ప్రకారం, సదరు నిందితులు AOB ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. కారులో మొత్తం 75 ప్యాకెట్లు, ఒక్కొక్కటి 2 కేజీల బరువు కలిగినవి ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.7.50 లక్షల విలువైన గంజాయి, రెండు వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లు సీజ్ చేశారు.

పోలీసుల తనిఖీలు గమనించి నిందితులు పారిపోవడానికి ప్రయత్నించినా, రాజానగరం పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను తూర్పు గోదావరి SP నరసింహ కిషోర్ ఆదేశాలతో, నార్త్ జోన్ DSP శ్రీకాంత్ పర్యవేక్షణలో నిర్వహించారు. రాజానగరం ఇన్స్పెక్టర్ వీరయ్య గౌడ్, SI మనోహర్, కానిస్టేబుళ్లు రమణ, నాగేశ్వరరావు, కరీముల్లా ఖాదర్ ఈ దాడిలో కీలకంగా వ్యవహరించారు.

ఈ ఘటనలో గంజాయి సరఫరా నెట్‌వర్క్‌పై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందీ, మరికొందరు ఈ అక్రమ రవాణాలో భాగమా అనే కోణంలో విచారణ చేపట్టారు. అరెస్టైన ఐదుగురిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై పోలీసు ఉన్నతాధికారులు సిబ్బందిని అభినందించారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version