Balakot Airstrikes: 2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బాలాకోట్లో వైమానిక దాడులు నిర్వహించగా, ఆ సమయంలో పాకిస్థాన్లో ఆధునిక F-16 ఫైటర్ జెట్లు ఉండడం ఎప్పటికీ చర్చలకు కారణమైంది. భారత వాయుసేన మాజీ చీఫ్ బీఎస్ ధనోవా తాజాగా ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను వెల్లడించారు.
ఓ ఇంటర్వ్యూలో ధనోవా చెప్పారు, “మిగ్-21లను పంపడం ఎవరి ఇష్టానికి కాకుండా, వాస్తవ పరిస్థితులు, భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులను బట్టి తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం.” శ్రీనగర్ ఎయిర్బేస్లో మిగ్-21లు మాత్రమే అందుబాటులో ఉండడం, సుఖోయ్-30 వంటి భారీ యుద్ధ విమానాలు ఆ సందర్భంలో డాగ్ఫైట్కి తగని సౌలభ్యం ఇవ్వలేకపోవడం ప్రధాన కారణాలేనని తెలిపారు.
డాగ్ఫైట్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫైటర్ జెట్ల మధ్య అతి సమీప గగన పోరాటం అని వివరించారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు హతమయ్యే ఉగ్ర దాడికి ప్రతీకారంగా ఫిబ్రవరి 26న బాలాకోట్ పై వైమానిక దాడులు జరిగింది.
ఈ ఘర్షణల్లో భారత మిగ్ ఒకటి కోల్పోయింది, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శత్రువుల చెరలో చిక్కుకున్నారు. అంతర్జాతీయ ఒత్తిడి మధ్య మూడు రోజుల తర్వాత ఆయనను పాక్ విడుదల చేసింది.
ALSO READ:Jagga Reddy | సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను తరలిస్తే ఊరుకోను
