Home Telangana మాంజ్రి గ్రామంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

మాంజ్రి గ్రామంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం

0
బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్విదర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలపై మండలంలోని మాంజ్రి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు దిష్టిబొమ్మ దహనం చేశారు.

మాంజ్రి గ్రామంలో జాతీయ రహదారి పై బీజేపీ మాజీ ఎమ్మెల్యే తన్విదర్ సింగ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ముధోల్ నియోజకవర్గ నాయకులు షిందే ఆనందరావు పటేల్, ప్రజాస్వామ్య బద్ధమైన వ్యక్తిగా ఉంటూ అప్రజాస్వామిక వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు.

ఆయనను బీజేపీ నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ మాజీ ఎమ్మెల్యేను అరెస్టు చేసి చట్టరిత్య చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు ఫరూక్ హైమత్ సిద్ధికి, జావిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

యువజన కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ నాయకులు కూడా ఈ నిరసనలో భాగమయ్యారు.

స్థానిక నేతలు, కార్యకర్తలు కలిసి బీజేపీ పై తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version