
వేంసూరు మండల కేంద్రంలో ఏడు రోజులుగా జర్నలిస్టులు చేస్తున్న దీక్షకు మండల ప్రజలు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపారు. ఏడవ రోజు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి దయానంద్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానందులు జర్నలిస్టులు చేస్తున్న దీక్ష వివరాలు తెలుసుకునేందుకు.. దీక్ష శిబిరం వద్దకు వచ్చి జరిగిన విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నారు. సమస్యకు కారణమైన అక్రమ మైనింగ్ అవకల వద్దకు స్వయంగా ఎమ్మెల్యే రాష్ట్ర నాయకులు వెళ్లి విచారణ చేపట్టారు.
దీక్ష శిబిరం వద్ద జర్నలిస్టుల సమస్యను తెలుసుకుంటున్న ఎమ్మెల్యే రాఘమయి కి, జర్నలిస్టులతో పాటు ఎమ్మార్వో ఆఫీసులో జరుగుతున్న ఆకృత్యాలను ప్రజాసంఘాలవారు, ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు