Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) భారత పర్యటనలో భాగంగా నేడు న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం అందుకున్నారు. ఉదయం రాష్ట్రపతి భవన్కు చేరుకున్న పుతిన్ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra modi) ఆత్మీయంగా స్వాగతం పలికారు.
అనంతరం అధికారిక గౌరవ వందన కార్యక్రమం నిర్వహించబడింది, ఇందులో పుతిన్ గౌరవ సైనిక దళాల వందనాన్ని స్వీకరించారు.
ALSO READ:IND vs SA 3rd ODI | వైజాగ్లో నిర్ణయాత్మక పోరు – ఎవరు గెలుస్తారు?
స్వాగత కార్యక్రమం ముగిసిన తరువాత, భారతదేశం మరియు రష్యాకు చెందిన ఉన్నతస్థాయి అధికార ప్రతినిధి బృంద సభ్యులను పరస్పరం పరిచయం చేసుకున్నారు.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు, వ్యూహాత్మక సహకారం, ఆర్థిక భాగస్వామ్యంపై సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఈ పర్యటన భారత–రష్య సంబంధాలలో కీలక దశగా పరిగణించబడుతున్నది.
