Avinash Reddy liquor scam: వైసీపీ హయాంలో వెలుగులోకి వచ్చిన మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాష్రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను “Supreme Court of India” తోసిపుచ్చింది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్(CJI JUSTICE SURYAKANT) నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. విచారణ అనంతరం అవినాష్రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయస్థానం, వెంటనే దర్యాప్తు అధికారి ఎదుట లొంగిపోవాలని స్పష్టం చేసింది.
పిటిషన్ను డిస్మిస్ చేస్తూ, లొంగిపోయిన తర్వాత ట్రయిల్ కోర్టులో సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
ఈ తీర్పుతో అవినాష్రెడ్డికి తాత్కాలిక ఉపశమనం లభించలేదు. మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు మరింత వేగం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ:Indian stock market today | ఏఐ భయాలతో మార్కెట్లు కుదేలు.. ఐటీ స్టాక్స్పై భారీ అమ్మకాలు
