
జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి సన్నాక సమావేశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా గ్రంధాలయ చైర్మన్ ప్రమాణస్వీకారం ఆదివారం 20 తేదీన సత్యా గార్డెన్లో 11 గంటలకు ఉంటుందని ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ కుమార్ జిల్లాలోని ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు పాల్గొంటున్నారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పండ్ల రాజు, బిక్కనూర్ మండల అధ్యక్షుడు భీం రెడ్డీ, కామారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుల గూడెం శ్రీనివాస్ రెడ్డి ,బిబిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుతారి రమేష్ ,రాజంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనే శ్రీనివాస్ మాచారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నౌసింగ్ ,పిసిసి కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి , బిక్కనూర్ సొసైటీ చైర్మన్ రాజు ,మున్సిపల్ కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్ అన్ని మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.