Home Telangana Medak నస్కల్ గ్రామంలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం

నస్కల్ గ్రామంలో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం

0
The 20th anniversary celebration in Naskal village featured a grand procession of the Goddess, highlighting unity and cultural festivities.
The 20th anniversary celebration in Naskal village featured a grand procession of the Goddess, highlighting unity and cultural festivities.

మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో గురువారం కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో 20వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం నుండి మండపం వరకు సింగిడి కేరళ బ్యాండ్ చే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో కులమతాలకు అతీతంగా అమ్మవారి ఊరేగింపులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సంవత్సరం విగ్రహాదాతగా కొండగారి స్వామి విగ్రహాన్ని అందించడం జరిగిందన్నారు. నవరాత్రులు అమ్మవారికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు కుంకుమార్చన, అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు 9 రోజులు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేశెట్టి సిద్ధ రాములు, లింగం గౌడ్, లక్ష్మ గౌడ్, ఎర్ర గౌడ్, శ్రీనివాస్ గౌడ్, స్వామి గౌడ్, వేణు గౌడ్, వెంకటేష్ గౌడ్, కౌండిన్య యూత్ సభ్యులు పాల్గొన్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version