Home Telangana Khammam పాలేరు రిజర్వాయర్ వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పరిశీలన

పాలేరు రిజర్వాయర్ వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పరిశీలన

0
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ పరిసరాల్లో వరదల వల్ల కలిగిన నష్టాన్ని ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం పరిశీలించింది.

కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్ పరివాహక ప్రాంతాల్లో వరద ముంపు గురైన పంట పొలాలను, రహదారులను కేంద్ర బృందం పరిశీలించింది.

రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై ఈ కేంద్ర బృందం సమీక్ష నిర్వహించింది.

నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సలహాదారు కల్నల్ కీర్తిప్రతాప్‌ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన బృందం ఆరా తీసింది.

కలెక్టర్ తో కలిసి పంటలు, రహదారులు, కాలువ కట్టలు వంటి ప్రాంతాలను బృందం సమగ్రంగా పరిశీలించింది.

కేంద్ర బృందంలో ఆర్థిక, వ్యవసాయ, రోడ్లు, గ్రామీణాభివృద్ధి శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగం కూడా ఈ ప్రాంతం పై అంచనా వేసేందుకు భాగస్వామ్యం వహించింది.

వరదల వల్ల పంట నష్టాన్ని సత్వర నివారణ చర్యలు తీసుకోవాలని బృందం సిఫారసులు చేసింది.

గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులకు మరిన్ని సహాయ చర్యలు అందించేందుకు కేంద్రం దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version