Home National జాతీయ క్రీడా పురస్కారాల్లో తెలుగు తేజాల ఘనత

జాతీయ క్రీడా పురస్కారాల్లో తెలుగు తేజాల ఘనత

0
Yerrraji Jyothi and Jeevangi Deepti win Arjuna Awards in Athletics and Para-Athletics. They are among 32 selected for the prestigious awards in 2024.
Yerrraji Jyothi and Jeevangi Deepti win Arjuna Awards in Athletics and Para-Athletics. They are among 32 selected for the prestigious awards in 2024.

కేంద్రం ప్రకటించిన జాతీయ క్రీడా పురస్కారాల్లో తెలుగు తేజాలు ఇద్దరు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ విభాగంలో జీవాంజి దీప్తిలకు అర్జున అవార్డులు దక్కాయి. యర్రాజి జ్యోతి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వాసి కాగా, జీవాంజి దీప్తి తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినవారు.

ఈ ఏడాది ఈ ఇద్దరితో పాటు మొత్తం 32 మంది అర్జున పురస్కారాలకు ఎంపిక అయ్యారు. అటు ఖేల్ రత్న పురస్కారానికి మనూ బాకర్‌, గుకేశ్‌, ప్ర‌వీణ్ కుమార్‌, హర్మ‌న్ ప్రీత్ సింగ్‌లను కేంద్రం ఎంపిక చేసింది. ఈ పురస్కారాలు వారి క్రీడా రంగంలో సాధించిన అద్భుత విజయాలకు గుర్తింపుగా అవి వర్తిస్తాయి.

అర్జున అవార్డులకుగాను సుచా సింగ్ (అథ్లెటిక్స్) మరియు మురళీకాంత్ పేట్కర్ (పారా-స్విమ్మింగ్) ఎంపికయ్యారు. ద్రోణాచార్య అవార్డులు సుభాష్ రాణా (పారా-షూటింగ్), దీపాలి దేశ్‌పాండే (షూటింగ్), సందీప్ సాంగ్వాన్ (హాకీ) వంటి కోచ్‌లకు ఇవ్వబడనున్నాయి. ఈ పురస్కారాలు క్రీడాకారుల మరియు కోచ్‌ల అద్భుత ప్రదర్శనకు గుర్తింపు.

జాతీయ క్రీడా అవార్డుల 2024 విజేతల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్‌లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version