కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా పేటలో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొణిదెల గ్రామానికి చెందిన శివమ్మ ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
కానీ అనంతరం కుటుంబ సమస్యల కారణంగా శివమ్మ చిన్నమ్మ శేషమ్మ పసిబిడ్డను ఆసుపత్రిలో వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటనతో ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఆందోళన చెందారు. వెంటనే వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.
సూచన అందుకున్న నందికొట్కూరు మహిళా పోలీసులు చురుగ్గా స్పందించి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా శేషమ్మను గుర్తించి తక్కువ సమయంలోనే ఆమెను కనుగొన్నారు.
అనంతరం పసిపాపను సురక్షితంగా తల్లి శివమ్మ వద్దకు చేర్చారు.స్థానిక ప్రజలు మహిళా పోలీసుల వేగవంతమైన చర్యలను ప్రశంసించారు.
ఒకవైపు నిర్లక్ష్యంతో పసిపాపను వదిలేసిన ఘటన విచారం కలిగించగా, మరోవైపు పోలీసులు చూపిన మానవతా హృదయం అందరినీ మెప్పించింది.
Also Read: జగిత్యాల జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు ఓవర్లోడ్-తృటిలో తప్పిన పెను ప్రమాదం
