ఐపీఎల్‌లో సుదర్శన్ సంచలనం – అరుదైన రికార్డు సాధన

GT's Sai Sudharsan creates history in IPL, scoring 1307 runs in just 30 innings, becoming second-fastest to reach the mark in IPL history.

ఐపీఎల్ 18వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ క్రికెటర్ సాయి సుదర్శన్ దుమ్మురేపుతున్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన అతను కేవలం 53 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టు విజయానికి మద్దతుగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.

ఈ అద్భుత ప్రదర్శనతో గుజరాత్ జట్టు 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోరు చేసింది. సుదర్శన్ ధాటికి ప్రత్యర్థి బౌలర్లు పేగులు విరిచారు. ముఖ్యంగా పవర్‌ప్లేలో వేగంగా పరుగులు చేసిన అతని ఆట జట్టుకు మంచి ఆధిక్యాన్ని ఇచ్చింది. ఈ ఇన్నింగ్స్‌ ద్వారా అతడు ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్‌లో తొలి 30 ఇన్నింగ్స్‌ల్లో 1,307 పరుగులు చేసిన సుదర్శన్, అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు షాన్ మార్ష్ (1,338) మాత్రమే అతనికంటే ముందున్నారు. సుదర్శన్ కంటే క్రిస్ గేల్, విలియమ్సన్, హేడెన్ వంటి దిగ్గజాలు తక్కువ పరుగులతో ఉన్నారు. ఇదే వేదికపై వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక భారతీయుడు కూడా సుదర్శనే కావడం విశేషం.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన సుదర్శన్, ఆరంభంలో పిచ్‌పై బంతి స్వింగ్ అయిందని, ఆర్చర్ బౌలింగ్‌కు తొలుత తలొరించాల్సి వచ్చిందని తెలిపాడు. అయితే, పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకుని ధైర్యంగా ఆడామని చెప్పాడు. “మేము ఇంకో 15 పరుగులు చేయాలని అనుకున్నాం. కానీ అదికంటే మెరుగైన స్కోర్ చేశాం” అంటూ తన సంతృప్తిని వ్యక్తం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *